RAHUL: నేను నిర్దోషిని... క్షమాపణ చెప్పను

మోదీ ఇంటిపేరు కేసులో సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీ పిటిషన్‌... క్షమాపణ అయితే ఎప్పుడో చెప్పేవాడినని వ్యాఖ్య;

Update: 2023-08-03 03:30 GMT

మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై పరువునష్టం కేసు‍ (Modi surname case)‌లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు‍ (Supreme Court )లో రిజాయిండర్ అఫిడవిట్( affidavit) దాఖలు చేశారు. 63 పేజీల అఫిడవిట్‌లో పరువు నష్టం కేసులో తాను ఎలాంటి నేరానికీ పాల్పడలేదని రాహుల్‌ (Rahul Gandhi) పేర్కొన్నారు. తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాల్లో( Lok Sabha sessions) పాల్గొనే అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ కేసు అసాధారణమైన కేటగిరి కిందకు రాదని రాహుల్‌గాంధీ( Rahul Gandhi) పిటిషన్‌లో పేర్కొన్నారు. క్షమాపణే అయితే( refused to apologise) ఈపాటికే చెప్పేవాడినని అన్నారు.


తానేమీ శిక్షార్హమైన నేరానికి పాల్పడలేదని తెలిపారు. ఒకవేళ క్షమాపణ చెప్పాల్సి వస్తే అదే అతిపెద్ద శిక్ష అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ క్షమాపణే అయితే ఈ పాటికే చెప్పేవాడినని పేర్కొన్నారు. తాను క్షమాపణ చెప్పడానికి నిరాకరించినందువల్లే తాను ‘అహంకారి’ అని పూర్ణేష్‌ మోదీ (BJP MLA Purnesh Ishwarbhai Modi )పేర్కొన్నారని తన అఫిడవిట్‌లో తెలిపారు. ఏ తప్పూ చేయకపోయినా ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్‌ నేరాలు మోపి బలవంతంగా క్షమాపణ చెప్పించాలనుకోవడం న్యాయ వ్యవస్థ సమయాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. తనపై విధించిన శిక్షపై స్టే విధించి వర్షాకాల సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని రాహుల్‌ గాంధీ కోరారు.


తన ప్రసంగానికి సంబంధించిన కేసుతో సహా మునుపటి కేసులన్నీ అధికార పార్టీ సభ్యులు, ఆ పార్టీ ఆఫీస్ బేరర్లే దాఖలు చేశారని సుప్రీంకోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో రాహుల్‌ పేర్కొన్నారు. 2019 ఏప్రిల్‌లో కర్నాటకలో కోలార్‌లో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, దొంగలందరికీ మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్‌ బీజేపీ నేత పూర్ణేష్ మోదీ 2019లో రాహుల్‌పై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్‌ను సూరత్ కోర్టు దోషిగా నిర్దారిస్తూ, రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఈ ఏడాది మార్చి 24న రాహుల్‌ వయనాడ్ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలో సూరత్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో వేసిన తాజా అఫిడవిట్‌లో రాహుల్ సవాలు చేశారు.

రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పకుండా అహంకారాన్ని ప్రదర్శించారని పూర్ణేష్‌ మోదీ ఆరోపించారు. ఈ కేసులో ఎప్పటికీ క్షమాపణలు చెప్పబోనని రాహుల్‌ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

Tags:    

Similar News