India Clinches 100 Medals : ఆసియా పారా గేమ్స్‌లో ఇండియా రికార్డ్

ఆసియా పారా గేమ్స్‌లో భారత్ కు 100 పతకాలు.. మన యువతకు అసాధ్యమైనది ఏదీ లేదు' అన్న ప్రధాని మోదీ

Update: 2023-10-28 08:15 GMT

ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం తొలిసారిగా 100 పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. పారా గేమ్స్‌లో భారతదేశం ఎన్నడూ ఈ మ్యాజిక్ త్రీ నంబర్ మార్కును చేరుకోలేదు. తొలిసారి 303 మంది సభ్యులతో కూడిన భారత బృందం ఊహించని రికార్డును బద్దలు కొట్టింది. భారతదేశం ఈ చారిత్రాత్మక విజయం తర్వాత దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

భారత బృందం 99 పతకాలతో గేమ్స్‌లో చివరి రోజును ప్రారంభించింది. దేశం 100 పతకాల మార్కును దాటడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పురుషుల 400 మీటర్ల T47 ఈవెంట్‌లో దిలీప్ మహదు గవిత్ స్వర్ణ పతకాన్ని సాధించడంతో భారత్‌కు మూడు అంకెల మార్కును తీసుకొచ్చాడు. 29 రజతాలు, 45 కాంస్య పతకాలతో పాటు భారత్‌కు ఇది 26వ స్వర్ణం.

భారత యువతకు సాధ్యం కానిది ఏదీ లేదని మోదీ తన ఎక్స్ ఖాతాలో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. "ఆసియా పారా గేమ్స్‌లో భారత్ కు 100 పతకాలు. ఈ విజయం మన క్రీడాకారుల ప్రతిభ, కృషి, సంకల్పం ఫలితం. ఈ అద్భుతమైన మైలురాయి మా హృదయాలను అపారమైన గర్వంతో నింపింది. క్రీడాకారులకు నా ప్రగాఢమైన అభినందనలు. మా అద్భుతమైన అథ్లెట్లు, కోచ్‌లు, వారితో పని చేస్తున్న మొత్తం సపోర్ట్ సిస్టమ్‌కు కృతజ్ఞతలు. ఈ విజయాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయి. మన యువతకు అసాధ్యమైనది ఏదీ లేదని రిమైండర్‌గా పనిచేస్తాయి" అని మోదీ ఎక్స్‌లో రాశారు.

దేశం ఇప్పుడు 29 బంగారు, 31 రజత, 51 కాంస్యాలను కలిగి ఉంది. అంతకుముందు పారా ఆసియా క్రీడలు, ఆసియా క్రీడల్లో తమ ప్రయాణంలో విజయాలు సాధించిన భారత అథ్లెట్లను మోదీ అభినందించారు. "ఆసియన్ పారా గేమ్స్‌లో ఆర్చరీ ఉమెన్స్ ఇండివిజువల్ కాంపౌండ్ ఓపెన్ ఈవెంట్‌లో శీతల్ దేవి అసాధారణమైన గోల్డ్ మెడల్ సాధించినందుకు గర్వపడుతున్నాను. ఈ ఘనత ఆమె పట్టుదలకు, సంకల్పానికి నిదర్శనం" అని చరిత్ర సృష్టించిన శీతల్‌కు మోదీ అభినందనలు తెలియజేశారు.

ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పతకం. 2018లో భారత బృందం దేశానికి 72 పతకాలు తెచ్చిపెట్టడం ద్వారా దేశానికి అత్యున్నతమైన పేరు ప్రతిష్టలు వచ్చాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా 100పతకాలు సాధించి రికార్డు సృష్టించింది.

Tags:    

Similar News