INDIAN ARMY: భారత్ జోలికొస్తే ఊచకోతే..!

భారత సైనిక వ్యవస్థలో కీలకమైన మార్పు

Update: 2025-10-07 05:30 GMT

భారత సైనిక వ్యవస్థలో ఒక కీలకమైన మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం, త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) మధ్య సమన్వయాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్‌ల ఏర్పాటు దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ 2019లోనే ఈ సంస్కరణలకు బీజం వేశారు.

ఉమ్మడి పోరాటానికి పద్మవ్యూహం

ప్ర­స్తు­తం ఆర్మీ, నేవీ, ఎయి­ర్‌­ఫో­ర్స్ వే­ర్వే­రు కమాం­డ్‌ల కింద పని­చే­స్తు­న్నా­యి. కొ­త్త థి­యే­ట­ర్ కమాం­డ్ వ్యూ­హం ప్ర­కా­రం, ఒకే భౌ­గో­ళిక ప్రాం­తం కోసం, ఈ మూడు దళాల ఆస్తు­లు, వన­రు­లు అన్నీ ఒకే కమాం­డ­ర్ ఆధ్వ­ర్యం­లో­కి వస్తా­యి. దీ­ని­వ­ల్ల యు­ద్ధ సమ­యా­ల్లో లేదా ఇతర కా­ర్య­క­లా­పా­ల్లో వే­గ­వం­త­మైన ని­ర్ణ­యా­లు, మె­రు­గైన సమ­న్వ­యం సా­ధ్య­మ­వు­తుం­ది. శత్రు దే­శా­ల­కు అం­తు­చి­క్క­ని పద్మ­వ్యూ­హం­లా ఇది పని­చే­స్తుం­ద­ని ని­పు­ణు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. వన­రు­లు, లా­జి­స్టి­క్స్, శి­క్షణ వంటి వా­టి­ని మరింత సమ­ర్థ­వం­తం­గా ఉప­యో­గిం­చు­కో­వ­డం ద్వా­రా ఖర్చు కూడా ఆదా అవు­తుం­ది.

సమన్వయం కోసం తొలి అడుగులు

ఈ సం­స్క­ర­ణ­ల­పై త్రి­విధ దళాల మధ్య ఏకా­భి­ప్రా­యం కు­ది­ర్చేం­దు­కు కృషి జరు­గు­తోం­ది. తొలి దశలో, తి­రు­వ­నం­త­పు­రం, వి­శా­ఖ­ప­ట్నం, గాం­ధీ­న­గ­ర్‌­ల­లో 3 ఉమ్మ­డి మి­ల­ట­రీ స్టే­ష­న్‌­లు ఏర్పా­టు చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చా­రు. త్రి­విధ దళాల సి­బ్బం­ది కలి­సి శి­క్షణ పొం­దేం­దు­కు, సహ­క­రిం­చు­కు­నేం­దు­కు ఇది దో­హ­ద­ప­డు­తుం­ది. ము­ఖ్యం­గా, ఇం­డి­య­న్ నేవీ నే­తృ­త్వం­లో కే­ర­ళ­లో­ని తి­రు­వ­నం­త­పు­రం­లో మా­రి­టై­మ్ థి­యే­ట­ర్ కమాం­డ్‌­ను ఏర్పా­టు చే­యా­ల­ని కేం­ద్రం యో­చి­స్తోం­ది. ఇది సము­ద్ర సరి­హ­ద్దుల భద్ర­త­ను పర్య­వే­క్షి­స్తుం­ది. సై­న్యం­లో ఈ ని­ర్మా­ణా­త్మక సం­స్క­రణ సమై­క్య­త­ను పెం­చి, భద్ర­తా­ప­ర­మైన ము­ప్పు­ల­ను సమ­ర్థ­వం­తం­గా తి­ప్పి­కొ­ట్టేం­దు­కు దో­హ­ద­ప­డు­తుం­ది. ఇది భారత రక్షణ సా­మ­ర్థ్యా­ల­ను గణ­నీ­యం­గా మె­రు­గు­ప­రు­స్తుం­ది. ఈ సం­స్క­ర­ణల ద్వా­రా, భారత సై­న్యం మల్టీ-డొ­మై­న్ వా­ర్‌­ఫే­ర్‌­కు సి­ద్ధ­మ­వు­తుం­ది. సై­బ­ర్, స్పే­స్ వంటి కొ­త్త పో­రాట సా­మ­ర్థ్యా­ల­ను కూడా ఈ కమాం­డ్‌ల కిం­ద­కు తీ­సు­కు­రా­ను­న్నా­రు. రెం­డు దశా­బ్దా­లు­గా చర్చ­ల్లో ఉన్న ఈ సం­స్క­ర­ణ­లు, పె­రు­గు­తు­న్న పాక్, చైనా ము­ప్పుల నే­ప­థ్యం­లో ఇప్పు­డు అత్యంత ఆవ­శ్య­కం­గా మా­రా­యి.

మంచు తుఫానులో చిక్కుకున్న 1000 మంది

మౌం­ట్ ఎవ­రె­స్ట్‌­పై మంచు తు­ఫా­న్ సం­భ­విం­చిం­ది. దీం­తో ట్రె­క్కిం­గ్‌­లో ఉన్న 1000 మంది తు­ఫా­ను­లో చి­క్కు­కు­న్నా­రు. వీ­రి­లో భా­ర­తీ­యు­లు, చై­నీ­యు­లు, అమె­రి­క­న్లు సహా ఇతర దే­శా­ల­కు చెం­దిన వారు ఉన్నా­రు. టి­బె­ట్ వైపు ఉన్న ఎవ­రె­స్ట్ తూ­ర్పు భా­గం­లో తీ­వ్ర మంచు తు­ఫా­ను వచ్చిం­ది. ఇప్ప­టి వరకు సు­మా­రు 350 మంది రక్షిం­చి­న­ట్టు వె­ల్ల­డిం­చా­రు. హె­లీ­కా­ప్ట­ర్లు, ట్రె­క్కిం­గ్ బృం­దాల సహా­యం­తో సహా­య­క­చ­ర్య­లు కొ­న­సా­గు­తు­న్నా­యి.

Tags:    

Similar News