Karnataka: త్వరలో ఇందిర క్యాంటీన్లు ప్రారంభం

కర్నాటకలో త్వరలో మళ్లీ ఇందిరా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.

Update: 2023-06-15 07:45 GMT

కర్నాటకలో త్వరలో మళ్లీ ఇందిరా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సిద్ధరామయ్య మానస పుత్రిక గా పేరు తెచ్చుకున్న ఇందిరా క్యాంటీన్‌2013-18 మధ్య తొలిసారిగా సేవలు అందించాయి.సబ్సిడీతో ఆహారాన్ని అందించే క్యాంటీన్లు బెంగళూరు వ్యాప్తంగా 250 ఔట్ లెట్లు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య.క్యాంటీన్లను పునరుద్ధరించి రాష్ట్రమంతటా విస్తరిస్తామ న్నారు. క్యాంటీన్లలో ఉదయం అల్పాహారం ఐదు రూపాయలు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఒక్కోటి పది రూపాయలుగా నిర్ణయించారు. ఇందిరా క్యాంటీన్‌ సేవల సదుపాయం, నిర్వహణపై ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు.

Tags:    

Similar News