జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా జవాన్
జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా జవాన్ జమ్మూ కాశ్మీర్లో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా జవాన్;
జమ్మూ కాశ్మీర్లో చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్ ప్రాణాలు కోల్పోయారు. చౌడేపల్లి మండలం కాట్పేరికి చెందిన శ్రీనివాసులు.. విధినిర్వహణలో నేలకొరిగాడు. గన్ మిస్ ఫైర్ కావడంతో శ్రీనివాసులు మృతి చెందినట్లు సీఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇవాళ శ్రీనివాసులు పార్థివదేహాన్ని స్వస్థలం తీసుకురానున్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగేళ్ల కిందట సీఆర్పీఎఫ్లో చేరిన శ్రీనివాసులు.. గన్ మిస్ ఫైర్ ఘటనలో చెందడం స్థానికంగా విషాదం నింపింది.