Lok Sabha Elections : లోక్సభ ఎన్నికలు 2024: ఓటెయనున్న 96.88 కోట్ల మంది ఓటర్లు
ఈ ఏడాది లోక్సభ ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది (96.88 కోట్లు) భారతీయులు ఓటు వేయడానికి అర్హులని ఎన్నికల సంఘం (EC)తెలిపింది. 18 నుండి 29 సంవత్సరాల వయస్సు గల రెండు కోట్ల మంది యువ ఓటర్లను కూడా ఓటర్ల జాబితాలో చేర్చారని చెప్పింది. గత లోక్సభ ఎన్నికలు జరిగిన 2019 నుండి నమోదైన ఓటర్లతో పోలిస్తే ఇది ఆరు శాతం పెరుగుదలను సూచిస్తోంది.
"ప్రపంచంలో అత్యంత ఎక్కువ ఓటర్లు- 96.88 కోట్ల మంది భారతదేశంలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు" అని ఈసీ (EC) తెలిపింది.
లింగ నిష్పత్తిలో పెరుగుదల
2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి పెరిగిందని పోల్ ప్యానెల్ తెలిపింది. ఎలక్టోరల్ రోల్ల రివిజన్లో బహిర్గతం, పారదర్శకతతో పాటు ఓటర్ల జాబితా స్వచ్ఛత, ఆరోగ్యంపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టిందని అధికారి ఒకరు సూచించారు. ప్రతి దశలో రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో పాటు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన వివిధ పనులను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ సందర్భంగా వివరించారు.