UP Madarsa : యూపీ మదర్సాల్లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు..

UP Madarsa : భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో.. జాతి, ధర్మం, కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ పాల్గొన్నారు.

Update: 2022-08-15 13:33 GMT

UP Madarsa : భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవాల్లో.. జాతి, ధర్మం, కులమత బేధాలు లేకుండా ప్రజలందరూ పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మదర్సాల్లోనూ పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగాయి. బిజ్నోర్‌, మొరాదాబాద్‌ లోని మదర్సాల్లో జెండా ఎగరేసి.. భారతమాతకు వందనం చేశారు. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోడానికి జరిగిన సమరం గురించి... ఉపాధ్యాయులు పిల్లలకు వివరించారు. అనేక చోట్ల వీధుల్లో మువ్వన్నెల జెండాలు పట్టుకుని ర్యాలీలు నిర్వహించారు.

Tags:    

Similar News