Manipur Violence: తాజా పరిస్థితిపై నివేదిక సమర్పించండి: సుప్రీంకోర్టు

తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా;

Update: 2023-07-03 11:30 GMT

మణిపూర్‌ హింసపై స్టేటస్‌ రిపోర్ట్‌ను సమర్పించాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాయుధ దుండగుల నుండి ప్రజలను రక్షించడం, పునరావాసం కల్పించడం, ఆయుధాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలకు సంబంధించి ఏం జరిగింది, ఏం జరగనుంది వంటి అంశాలతో ఒక తాజా నివేదికను ఇవ్వాల్సిందిగా కోరింది.

వేసవి సెలవుల తర్వాత మొదలైన సుప్రీంకోర్టు మణిపూర్ తాజా పరిస్థితులపై ఆరా తీసింది. భారత సైన్యం నుంచి కుకీ తెగలకు రక్షణ కల్పించాలని ఢిల్లీలోకి చెందిన మణిపూర్ ట్రైబల్ ఫోరం వేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ జరింది.

హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తాజా పరిస్థితిపై స్థాయీ నివేదకను ఇవ్వాలని, పునరావాస శిబిరాలు, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి అప్డేడెట్ సమాచారాన్ని తమకు అందజేయాలని సీజేఐ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జూలై 10వ తేదీకి వాయిదా వేసింది.మణిపూర్ ట్రైబల్ ఫోరం తరఫున సీనియర్ న్యాయవాది కాలిన్ గోంసాల్వేస్ కోర్టు ముందు తన వాదన వినిపిస్తూ, మణిపూర్‌లో పరిస్థితి విషమించిందని చెప్పారు. మణిపూర్‌లో హింసాకాండపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బూటకపు హామీలిచ్చాయని, అయితే ఏమాత్రం వారికి చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసులను గిరిజనులు విశ్వసించడం లేదని, ఇండియన్ ఆర్మీతో వారిని రక్షణ కల్పించాలని కోరింది.




 దీనికి మణిపూర్ తరఫున భారత సొలిసిటర్ జనరల్ సమాధానమిస్తూ, పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోందని చెప్పారు. రోజులో 5 గంటల పాటు కర్ఫ్యూ సడలిస్తున్నారని, పరిస్థితి కుదుటపడుతోందనడానికి ఇది నిదర్శనమని వివరించారు. రాష్ట్ర పోలీసులు, మణిపూర్ కమెండోలో, భారత రిజర్వ్ బెటాలియన్లు, 114 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మణిపూర్‌లో మోహరించాయని తెలిపారు.

ఇక మైటీస్ ఆర్గనైజేషన్ తరఫున న్యాయవాది తన వాదన వినిపిస్తూ, హింస వెనుక ఆయుధాలు, మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయా అనే దానిపై విచారణ జరపాలన్నారు. కొన్ని ప్రతేక షెల్టర్ల నుంచి మిలిటెంట్ల గ్రూప్ లు బయటకు వచ్చి పోరాడుతున్నాయనే అనుమానం కలుగుతోందని, లేదంటే మారణాయుధాలు, మిలిటెంట్ల లెక్కలు ఎలా చెప్పగలుగుతారని ప్రశ్నించారు.

కేసులో వాదనలు విన్న ధర్మాసనం మెయిటీ, కుకీ తెగల మధ్య హింసాకాండలో బాధితుల పునరావాసానికి చేపట్టిన చర్యలు వివరిస్తూ తాజా స్థాయీ నివేదికను అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గత మే 3న ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ మణిపూర్ నిర్వహించిన ర్యాలీ అనంతరం హిందూ మెయిటీలు, క్రిష్టియన్ గిరిజన కుకీల మధ్య అల్లర్లు చెలరేగి, అది హింసాకాండగా మారింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు హింసాకాండ విస్తరించడంతో మణిపూర్ భగ్గుమంటోంది.

Tags:    

Similar News