Mithun Chakraborty : వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిథున్ చక్రవర్తి..
Mithun Chakraborty : బెంగాళ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు మిథున్ చక్రవర్తి.;
Mithun Chakraborty : బెంగాల్లో ఇప్పటికిప్పుడు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని… పార్టీ సీనియర్ నేత, సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి అన్నారు. బలవంతంగా లాక్కున్న అధికారం ఎక్కువ కాలం నిలవదన్న విషయం ఇప్పుడిప్పుడే మమతకు అర్థమవుతున్నట్లుంది అంటూ విమర్శలు గుప్పించారు. 38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని… ఏకంగా 21 మంది తనతోనే మాట్లాడారంటూ మిథున్ సంచలన వ్యాఖ్యలు చేశారు