Congo: కాంగోలో అంతు చిక్కని వ్యాధితో 53 మంది మృతి
లక్షణాలు ఏంటంటే ..్షణాలు ఏంటంటే ..;
కాంగోలో అంతు చిక్కని వ్యాధి పౌరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. దేశ వాయువ్య ప్రాంతంలో ఈ వ్యాధి బారిన పడి గత ఐదు వారాల వ్యవధిలో 50 మందికి పైగా మృతి చెందారు. తొలుత గబ్బిలాన్ని తిన్న ముగ్గురు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఈ వ్యాధి విస్తరించి పలువురు మరణించారు. మొదట జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు కన్పించే ఈ వ్యాధి బారిన పడ్డవారిలో చాలా మంది 48 గంటల్లోనే మృతి చెందుతున్నారు. దేశంలో 419 కేసులు నమోదు కాగా, 53 మంది మరణించారు. తొలత బొలోకో అనే గ్రామంలో జనవరిలో ఈ వ్యాధి బయటపడింది.
ఈ లక్షణాలు కనిపిస్తే..
రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రస్తుతం ఈ వైరస్ విజృంభిస్తోంది. అయితే ఈ వింత వ్యాధికి కారణమేంటో సరిగ్గా తెలియదు. ఈ ఏడాది జనవరిలో ఈక్వేటర్ ప్రావిన్స్లోని బోలోకో గ్రామంలో ఈ వైరస్ను అధికారులు గుర్తించారు. బోలోకోలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇది సోకింది. ఈ వైరస్ సోకిన వెంటనే అలసట, విరేచనాలు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఆ తర్వాత ముగ్గురు పిల్లలు మరణించారు. అయితే ఈ ముగ్గురు పిల్లలు గబ్బిలం మాంసం తిన్నట్లు వైద్యులు గుర్తించారు. దీని వల్లే వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం 500కి పైగా కేసులు ఉన్నట్లు కాంగో తెలిపింది.