Narendra Modi: ఉత్తరాఖండ్‌లో మోదీ పర్యటన.. రూ.17 వేల కోట్ల విలువతో..

Narendra Modi: ఉత్తరాఖండ్‌లో అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు.

Update: 2021-12-30 14:45 GMT

Narendra Modi (tv5news.in)

Narendra Modi: ఉత్తరాఖండ్‌లో అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. 17 వేల కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ తీరు వల్లే ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉత్తరాఖండ్ అభివృద్థికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధే ఎజెండాగా సబ్‌ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. 

Tags:    

Similar News