Netaji Subhas Chandra Bose : నేతాజీ అవశేషాలను తీసుకురావాలన్న బోస్ మనవడు
జపాన్ లోని రెంకోజీ ఆలయంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అవశేషాలను వెనక్కి తీసుకురావాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 18లోగా వెనక్కి తీసుకురావాలని కోరారు. నేతాజీపై వస్తున్న తప్పుడు కథనాలకు బ్రేక్ పడాలంటే ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి తుది ప్రకటన రావాలని ఆయన అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడికి సంబంధించిన ఫైళ్లను బహిర్గతం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం చొరవ తీసుకుందని చెప్పారు. జాతీయంగా, అంతర్జా తీయంగా మొత్తం 10 విచారణల తర్వాత తైవాన్ విమాన ప్రమాదంలో నేతాజీ ఆగస్టు 18, 1945న మరణించారని స్పష్టంగా తేలిందని చెప్పారు. కాబట్టి భారత ప్రభుత్వం నేతాజీ మరణంపై తప్పుడు సమాచారం తొలిగిపోయేందుకు భారత ప్రభుత్వం తుది ప్రకటన చేయడం అత్యవసరమని చంద్రకుమార్ బోస్ ఆదివారం మోదీకి ఒక లేఖ రాశారు.
నేతాజీ అవశేషాలను ఆగస్టు 18, 2024 నాటికి రెంకోజీ నుండి భారతదేశానికి తిరిగి తీసుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నేతాజీ భారత్ కు తిరిగి రావా లనుకున్నారని, అయితే విమాన ప్రమాదంలో మరణించినందున కుదరలేదని చెప్పారు. రెంకోజీ ఆలయంలో నేతాజీ అస్థికలను ఉంచడం చాలా అవ మానకరమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ కి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానేత అవశేషాలు భారత నేలను తాకాలని మేము గత మూడున్నరేళ్లుగా ప్రధానికి లేఖ రాస్తున్నానని చెప్పారు. నేతాజీ కుమార్తె అనితా బోస్ హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని కోరుకుంటున్నట్లు బోస్ పేర్కొన్నారు. 1945 ఆగస్ట్ లో జపాన్ లో లొంగిపోయిన తర్వాత జపాన్ మిలిటరీ విమానంలో తైవాన్ ను వదిలి రష్యాకు వెళుతుండగా విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్లు చరిత్ర చెబుతోంది.