Varun Gandhi: సాధువులు ఎప్పుడైనా సీఎం కావచ్చు..!

యోగి ఆదిత్యనాథ్ పై వరుణ్ సెటైర్లు

Update: 2023-08-30 06:30 GMT

సొంతపార్టీపైనే బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ సెటైర్ వేశారు. సాధువులను ఎవరూ ఏమీ అనొద్దని, ఎందుకంటే ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో ఏం చెప్పగలమని పరోక్షంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బీజేపీ నేత వరుణ్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీపైనా, నేతలపైనా ఈ మధ్య సెటర్లు వేస్తున్నారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా పార్టీకి నష్టం కలిగించే అనేక పోస్టులను ఆయన పెడుతున్నారు. అయితే ఈసారి వరుణ్ గాంధీ అలాంటి పనినే చేశారు. తన నియోజకవర్గమైన పిలిభిత్‌లో పార్టీ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరణ్ గాంధీ. ఇక ఆ సమావేశంలో సొంతపార్టీపైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆయన సమావేశంలో మాట్లాడుతున్న సమయంలో ఓ సాధువు ఫోన్ రింగయింది. ఆయన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేయమని కార్యకర్తలు ఎక్కడ చెబుతారోనని ముందే స్పందించిన వరుణ్.. ఆ సాధువును ఎవరూ ఏమీ అనొద్దని, సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వరుణ్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. యోగి ఆదిత్యనాథ్ గతంలో ఉత్తర ప్రదేశ్‌లోని గోరక్ష పీఠాధీశ్వరుడు. సీఎం అయిన తరువాత కూడా ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలే ధరిస్తారు. 

Tags:    

Similar News