Supreme Court: నేరాలు చేసి పారిపోయిన వారినిపట్టుకొచ్చే అధికారం కేంద్రానికి ఉంది..
నేరాలు చేసి పారిపోయిన వారినిపట్టుకొచ్చే అధికారం కేంద్రానికి ఉంది..
భారత్ లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను పట్టుకొచ్చే సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని దేశ సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. అయితే, గుజరాత్కు చెందిన విజయ్ మురళీధర్ ఉద్వానీ తనపై నమోదైన 153 కేసులకు సంబంధించి జారీ అయిన రెడ్ కార్నర్ నోటీస్పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిల్ ను విచారణకు తిరస్కరించినట్లు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పేర్కొనింది.
ఇక, 2022 జులైలోనే దుబాయ్కు పారిపోయిన మీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కరెక్టేనంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్వానీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారణ సందర్భంగా.. మీపై అనేక ఆరోపణలు, 153 కేసులు సైతం ఉన్నాయి.. ముందు భారత్ రావాల్సిందే.. వస్తే ఎర్రతివాచీ పరిచి స్వాగతం చెబుతామని అనుకో వద్దని తెలిపింది. అయితే, తన పిటిషన్దారుకు తనపై 38 కేసుల వివరాలు కూడా తెలీయదని అతడి తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. దీనిపై న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. వివరాలు తెలీయదంటే ఎలా? ట్రయల్ కోర్టుకు వెళ్లి సర్టిఫైడ్ కాపీల కోసం అప్లై చేస్తే వాళ్లే ఇస్తారని తెలిపింది. ఇదేం రాకెట్ తయారీ శాస్త్రం కాదు.. అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని అన్నారు. ఎఫ్ఐఆర్లలోని వివరాలను అధికారులు చెప్పడం లేదని లాయర్ వాదించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం.
అయితే, ఎఫ్ఐఆర్ వివరాలు మీకు దుబాయ్కి వచ్చి బంగారు పళ్లెంలో పెట్టి అందించాలా? ముందు భారత్కు రండి.. వచ్చిన తర్వాత అన్ని వివరాలు అందిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఉద్వానీ దగ్గర ప్రస్తుతం పాస్పోర్ట్ లేదు.. ఎలా మరి? అని ప్రశ్నించగా.. అంత కష్టపడొద్దు.. అధికారులు అక్కడ అరెస్ట్ చేసి తీసుకొస్తారులే అని న్యాయస్థానం చెప్పింది. అతడి తోటి నిందితుడు భారత్లో పోలీస్ కస్టడీలో మరణించాడు.. అందుకే నా పిటిషనర్ భారత్కు వచ్చాక సీసీటీవీ నిఘా ఉన్న గదిలోనే పెట్టాలని అడ్వకేట్ కోరగా.. ఇంక ఈ పిటిషన్పై విచారణ చేయలేమని ధర్మాసనం సీరియస్ కావడంతో ఆ పిటిషన్ను లాయర్ విత్ర డ్రా చేసుకున్నాడు.