NOIDA: ఆదీ ఆశ్రమం కాదు.. ఓ నరకం!

వృద్దుల చేతులు కట్టి, బేస్‌మెంట్‌లో నిర్బంధం;

Update: 2025-06-28 06:30 GMT

“వృ­ద్ధా­ప్యం ఓ దశ కాదు... ఒక పర్యా­యం. అది ప్రే­మ­కు, ఆద­ర­ణ­కు అర్హత పొం­దే దశ. కానీ నో­యి­డా­లో­ని ఓ వృ­ద్ధా­శ్ర­మం­లో చూ­పిన దృ­శ్యా­లు మన మా­న­వ­త్వా­న్ని కర­గ­దీ­సే­లా ఉన్నా­యి. ఆశ్ర­యం ఇవ్వా­ల్సిన చోటే అవ­మా­నం, అటె­న్ష­న్ ఇవ్వా­ల్సిన సమ­యం­లో ని­ర్ల­క్ష్యం, జీ­వి­తాం­తం సేవ చే­సిన వా­రి­కి చి­వ­రి­కి ని­ర్ఘా­తన. వృ­ద్ధు­లు చే­తు­లు కట్టే­సి, మల­మూ­త్రాల మధ్య జీ­విం­చా­ల్సిన బా­ధ­ని చూ­సిన వారు కన్నీ­ళ్లు ఆప­లే­రు. ఇది సమా­జం ఎం­త­గా వి­ఫ­ల­మైం­దో తె­లి­పే జీ­వ­చి­హ్నం!”

ఒక సమాజ అభి­వృ­ద్ధి స్థా­యి­ని అర్థం చే­సు­కో­వా­లం­టే, అక్కడ బల­హీన వర్గా­లు, ము­ఖ్యం­గా వృ­ద్ధు­లు, పి­ల్ల­లు ఎలా జీ­వి­స్తు­న్నా­రు అనే­ది చూ­స్తే చాలు. కానీ నో­యి­డా సె­క్టా­ర్ 55లోని ఓ ‘ఆశ్ర­మం’ లో వె­లు­గు­చూ­సిన దృ­శ్యా­లు మన సం­స్కృ­తి­ని సి­గ్గు­ప­డే­లా చే­శా­యి. ఆశ్ర­య­మి­వ్వా­ల్సిన చోటే, ఆత్మ­ల­పై అఘా­యి­త్యా­లు జరు­గు­తుం­టే, మని­షి తన మా­న­వ­త్వా­న్ని ఎక్కడ కో­ల్పో­యా­డో అని అన్వే­షిం­చా­ల్సిం­దే.

మానవత్వాన్ని చీల్చేసిన ఆనంద్ నికేతన్‌

‘ఆనం­ద్ ని­కే­త­న్’ అనే పే­రు­తో నడు­స్తు­న్న ఈ వృ­ద్ధా­శ్ర­మం లో జరి­గిన ఘట­న­లు హృ­ద­యా­ల­ను హత్తు­కు­నే­లా కాదు… హిం­సిం­చే­లా ఉన్నా­యి. అక్క­డి వృ­ద్ధుల చే­తు­లు కట్టే­సి ఉం­చ­డం, మరి­కొం­ద­రి­ని బే­స్‌­మెం­ట్‌­లో ని­ర్భం­దిం­చ­డం, వా­రి­ని మల­మూ­త్రం­తో తడి­సిన దు­స్తు­ల్లో­నే వది­లే­య­డం... ఇవ­న్నీ 21వ శతా­బ్దం­లో చూ­స్తు­న్న దా­రు­ణా­లు. దీ­ని­కి వీ­డి­యో­లు సా­మా­జిక మా­ధ్య­మా­ల్లో వై­ర­ల్ అయ్యాక స్పం­దిం­చిన అధి­కా­రు­లు ఆశ్ర­మం­పై దాడి చేసి, 42 మంది వృ­ద్ధు­ల­ను వి­ము­క్తి చే­శా­రు. ఆశ్ర­మా­ని­కి ఎలాం­టి అను­మ­తు­లు లే­కుం­డా, ము­ప్పై ఏళ్లు­గా అక్ర­మం­గా నడి­పిం­చ­బ­డు­తోం­ది అనే నిజం మరింత ది­గ్భ్రాం­తి­కి గు­రి­చే­సిం­ది. అం­తే­కా­దు, ఒక్కో వృ­ద్ధు­డి నుం­చి ₹2.5 లక్షల చొ­ప్పున వసూ­లు చేసి, నె­ల­వా­రీ ఖర్చు­లు అద­నం­గా వసూ­లు చే­య­డం... ఇది వ్యా­పా­రం కాదు, మానవ హక్కుల ఉల్లం­ఘన. మానవ హక్కుల ఉల్లంఘనపై పలు రాజకీయ పార్టీలు, నేతలు, మానవ హక్కు సంఘ నేతలు భగ్గుమంటున్నారు. వృద్ధులను వేధించడంపై భగ్గుమన్నారు.

ఇది విఫలమైన వ్యవస్థకు నిదర్శనం

ఇలాం­టి ఘట­న­లు చో­టు­చే­సు­కో­వ­డ­మే మనకు ఓ పె­ద్ద హె­చ్చ­రిక. పె­ద్దల భద్రత కోసం చట్టా­లు, కమి­ష­న్లు ఉన్నా… నిఘా వ్య­వ­స్థ­లు ఎం­దు­కు వి­ఫ­ల­మ­య్యా­యి? మానవ హక్కుల సం­ర­క్ష­ణ­కు నా­మ­మా­త్ర­పు చర్య­లు తీ­సు­కుం­టూ ఉంటే, ఈ భవి­ష్య­త్తు­లో ఇం­కె­న్నో ‘ఆశ్రమ’లు నర­క­గృ­హా­లు­గా మా­రి­పో­తా­యి. ఇక్కడ ఆశ్ర­యం పొం­దే చాలా మంది వృ­ద్ధు­లు మధ్య తర­గ­తి, ఉన్న­త­వ­ర్గాల వారే. సొంత బి­డ్డల చేత గెం­టే­య­బ­డ్డ­వా­రే. సమా­జం­లో హుం­దా­త­నా­న్ని , గౌ­ర­వ­ప్ర­ద­మైన వృ­ద్ధా­ప్యా­న్ని ఒక బా­ధా­కర దశగా మా­ర్చే­లా ఈ వ్య­వ­స్థ­లు మా­రు­తు­న్నా­యి. ఇది కే­వ­లం ఓ వృ­ద్ధా­శ్రమ ఘో­ర­మైన మానవ హక్కుల ఉల్లం­ఘన కాదు… ఇది మన బు­ద్ధి­కి తల­కొ­రు­కే అంశం.

సమాజంగా మనం ఏం చేయాలి?

ఈ ఘటనపై కేవలం కోపం వ్యక్తం చేయడమే కాకుండా, బాధ్యత తీసుకోవాలి. వృద్ధుల సంరక్షణపై కఠిన చట్టాలు, పర్యవేక్షణ పటిష్టత, ప్రభుత్వాల చురుకుతనమే కాకుండా, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ‘మన వృద్ధుల రక్షణ’ను వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. ఈ ఘటన మన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. సమాజంగా మనం వృద్ధులను ఎలా చూస్తున్నాం? అనే ప్రశ్నను మన ముందుంచుతోంది. ఇప్పుడు స్పందించకపోతే, రేపు ఈ చీకటి ఆవేశం మరెక్కడైనా, మరొకరి తల్లిదండ్రులపై కాక… మన మీదే పడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వృద్ధులను ఇంతలా వేదించడంపై నెట్టంట విసృృత చర్చ జరుగుతోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను సహించ వద్దని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News