NOIDA: ఆదీ ఆశ్రమం కాదు.. ఓ నరకం!
వృద్దుల చేతులు కట్టి, బేస్మెంట్లో నిర్బంధం;
“వృద్ధాప్యం ఓ దశ కాదు... ఒక పర్యాయం. అది ప్రేమకు, ఆదరణకు అర్హత పొందే దశ. కానీ నోయిడాలోని ఓ వృద్ధాశ్రమంలో చూపిన దృశ్యాలు మన మానవత్వాన్ని కరగదీసేలా ఉన్నాయి. ఆశ్రయం ఇవ్వాల్సిన చోటే అవమానం, అటెన్షన్ ఇవ్వాల్సిన సమయంలో నిర్లక్ష్యం, జీవితాంతం సేవ చేసిన వారికి చివరికి నిర్ఘాతన. వృద్ధులు చేతులు కట్టేసి, మలమూత్రాల మధ్య జీవించాల్సిన బాధని చూసిన వారు కన్నీళ్లు ఆపలేరు. ఇది సమాజం ఎంతగా విఫలమైందో తెలిపే జీవచిహ్నం!”
ఒక సమాజ అభివృద్ధి స్థాయిని అర్థం చేసుకోవాలంటే, అక్కడ బలహీన వర్గాలు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఎలా జీవిస్తున్నారు అనేది చూస్తే చాలు. కానీ నోయిడా సెక్టార్ 55లోని ఓ ‘ఆశ్రమం’ లో వెలుగుచూసిన దృశ్యాలు మన సంస్కృతిని సిగ్గుపడేలా చేశాయి. ఆశ్రయమివ్వాల్సిన చోటే, ఆత్మలపై అఘాయిత్యాలు జరుగుతుంటే, మనిషి తన మానవత్వాన్ని ఎక్కడ కోల్పోయాడో అని అన్వేషించాల్సిందే.
మానవత్వాన్ని చీల్చేసిన ఆనంద్ నికేతన్
‘ఆనంద్ నికేతన్’ అనే పేరుతో నడుస్తున్న ఈ వృద్ధాశ్రమం లో జరిగిన ఘటనలు హృదయాలను హత్తుకునేలా కాదు… హింసించేలా ఉన్నాయి. అక్కడి వృద్ధుల చేతులు కట్టేసి ఉంచడం, మరికొందరిని బేస్మెంట్లో నిర్భందించడం, వారిని మలమూత్రంతో తడిసిన దుస్తుల్లోనే వదిలేయడం... ఇవన్నీ 21వ శతాబ్దంలో చూస్తున్న దారుణాలు. దీనికి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాక స్పందించిన అధికారులు ఆశ్రమంపై దాడి చేసి, 42 మంది వృద్ధులను విముక్తి చేశారు. ఆశ్రమానికి ఎలాంటి అనుమతులు లేకుండా, ముప్పై ఏళ్లుగా అక్రమంగా నడిపించబడుతోంది అనే నిజం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంతేకాదు, ఒక్కో వృద్ధుడి నుంచి ₹2.5 లక్షల చొప్పున వసూలు చేసి, నెలవారీ ఖర్చులు అదనంగా వసూలు చేయడం... ఇది వ్యాపారం కాదు, మానవ హక్కుల ఉల్లంఘన. మానవ హక్కుల ఉల్లంఘనపై పలు రాజకీయ పార్టీలు, నేతలు, మానవ హక్కు సంఘ నేతలు భగ్గుమంటున్నారు. వృద్ధులను వేధించడంపై భగ్గుమన్నారు.
ఇది విఫలమైన వ్యవస్థకు నిదర్శనం
ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడమే మనకు ఓ పెద్ద హెచ్చరిక. పెద్దల భద్రత కోసం చట్టాలు, కమిషన్లు ఉన్నా… నిఘా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? మానవ హక్కుల సంరక్షణకు నామమాత్రపు చర్యలు తీసుకుంటూ ఉంటే, ఈ భవిష్యత్తులో ఇంకెన్నో ‘ఆశ్రమ’లు నరకగృహాలుగా మారిపోతాయి. ఇక్కడ ఆశ్రయం పొందే చాలా మంది వృద్ధులు మధ్య తరగతి, ఉన్నతవర్గాల వారే. సొంత బిడ్డల చేత గెంటేయబడ్డవారే. సమాజంలో హుందాతనాన్ని , గౌరవప్రదమైన వృద్ధాప్యాన్ని ఒక బాధాకర దశగా మార్చేలా ఈ వ్యవస్థలు మారుతున్నాయి. ఇది కేవలం ఓ వృద్ధాశ్రమ ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన కాదు… ఇది మన బుద్ధికి తలకొరుకే అంశం.
సమాజంగా మనం ఏం చేయాలి?
ఈ ఘటనపై కేవలం కోపం వ్యక్తం చేయడమే కాకుండా, బాధ్యత తీసుకోవాలి. వృద్ధుల సంరక్షణపై కఠిన చట్టాలు, పర్యవేక్షణ పటిష్టత, ప్రభుత్వాల చురుకుతనమే కాకుండా, ప్రతి కుటుంబం, ప్రతి మనిషి ‘మన వృద్ధుల రక్షణ’ను వ్యక్తిగత బాధ్యతగా భావించాలి. ఈ ఘటన మన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. సమాజంగా మనం వృద్ధులను ఎలా చూస్తున్నాం? అనే ప్రశ్నను మన ముందుంచుతోంది. ఇప్పుడు స్పందించకపోతే, రేపు ఈ చీకటి ఆవేశం మరెక్కడైనా, మరొకరి తల్లిదండ్రులపై కాక… మన మీదే పడవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వృద్ధులను ఇంతలా వేదించడంపై నెట్టంట విసృృత చర్చ జరుగుతోంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను సహించ వద్దని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.