BABY THUMB: శిశువు బొటనవేలు కోసేసిన నర్సు

ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర నిర్లక్ష్యం!;

Update: 2025-06-01 04:45 GMT

ఓ నర్సు చాలా నిర్లక్ష్యంగా నవజాత శిశువు బొటన వేలు కోసిన దారుణమైన ఘటన తమిళనాడులో జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాన్యుల ఎడల చూపుతున్న నిర్లక్ష్యానికి ఇది మరో ఉదాహరణగా నిలించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, తమిళనాడు వెల్లూరు జిల్లాలోని ముల్లిపాళయంకు చెందిన విమల్​రాజ్​, నివేత దంపతులు. నివేత ఈ నెల 24వ తేదీన అడుక్కంపరైలోని వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తరువాత కూడా నివేత తన బిడ్డతో సహా ఆసుపత్రిలో ఉంటూ, చికిత్స పొందుతోంది.

ఈ క్రమంలో నర్సులు బిడ్డకు గ్లూకోజ్, మందులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం బిడ్డ చేతికి అమర్చిన నీడిల్ మార్చడానికి ప్రయత్నించారు. అయితే నీడిల్​కున్న టేప్ తొలగించేందుకు ఓ నర్సు కత్తెర తీసుకున్నారు. కానీ ఆమె చాలా నిర్లక్ష్యంగా టేప్​నకు బదులుగా బాలుని బొటనవేలును కత్తిరించేసింది. దీనితో ఆ శిశువు నొప్పితో విలవిలలాడుతూ ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ ఘటనతో షాక్ తిన్న బిడ్డ తల్లిదండ్రులు నర్సులతో వాగ్వాదానికి దిగారు. తరువాత వారి బంధువులు కూడా వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. నర్సు నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ వేలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బిడ్డకు ప్లాస్టిక్ సర్జరీ!

దీనితో వెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి యంత్రాంగం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆ చిన్నారికి ప్లాస్టిక్ సర్జరీ చేసేందుకు 108 అంబులెన్స్​లో చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. మరోవైపు ఈ విషయంపై ఆసుపత్రి యంత్రాంగం, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News