Bihar: కల్తీ మద్యం తాగిన వారిలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికి 11 మంది..
Bihar: సంక్రాంతి పండుగ పూట బిహార్లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది.
Bihar: సంక్రాంతి పండుగ పూట బిహార్లో కల్తీ మద్యం తీవ్ర విషాదం నింపింది. సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలో కల్తీ మద్యం తాగి 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పట్టణంలో సోసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటీ పహారీ, పహారీ తల్లి ప్రాంతాల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులంతా 50 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు వారుగా పోలీసులు గుర్తించారు.