త్వరలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి : మోదీ ఆశాభావం

Update: 2020-11-28 10:06 GMT

భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలను అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. కొవాగ్జిన్‌ పురోగతిని శాస్త్రవేత్తలు తనకు పూర్తిగా వివరించారని.. త్వరలోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌ బయోటెక్‌-ఐసీఎంఆర్‌ సంయుక్త ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తున్నాయి అన్నారు. అంతకుముందు భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన ఆయన.. వ్యాక్సిన్‌ సామర్థ్యంపై శాస్త్రవేత్తలతో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News