శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ క్షమాపణలు..
మహారాష్ట్రలోని సింధుదుర్గ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం క్షమాపణలు చెప్పారు.;
2013లో బీజేపీ నన్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. నేను చేసిన మొదటి పని రాయ్గఢ్లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ సమాధి ముందు ఒక భక్తుడిగా కూర్చుని కొత్త ప్రయాణం ప్రారంభించడం” అని మోదీ పాల్ఘర్లో అన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనకు పేరు మాత్రమే కాదు... ఈ రోజు నేను నా దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి తల వంచి క్షమాపణలు కోరుతున్నాను. భరతమాత గొప్ప పుత్రుడు, ఈ నేల పుత్రుడు వీర్ సావర్కర్ను దూషిస్తూ, అవమానించేది మేము కాదు. క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా లేరు, కోర్టులకు వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు’’ అని అన్నారు.
ఆగస్ట్ 26న కూలిన 35 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని గౌరవించే లక్ష్యంతో సింధుదుర్గ్లో మొదటిసారిగా నిర్వహించిన నేవీ డే వేడుకల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్ 4న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, అందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. భారతీయులు, ముఖ్యంగా మహరాష్ట్రీయన్లు పూజించే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని మాల్వాన్ యొక్క రాజ్కోట్ కోటలో తయారు చేశారు.