PM Modi: మలేషియాలో జరిగే ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని దూరం

భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరు

Update: 2025-10-23 03:45 GMT

ప్రధాని మోడీ మరో విదేశీ పర్యటనకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల గాజా శాంతి శిఖరాగ్ర సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈజిప్టు వేదికగా జరిగిన ఈ సమావేశానికి ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినా మోడీ వెళ్లలేదు. తాజాగా మలేషియా వేదికగా అక్టోబర్ 26 నుంచి 28 వరకు ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. ఈ సమావేశానికి కూడా ప్రధాని మోడీ వెళ్లడం లేదని తెలుస్తోంది.

ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఆసియన్ శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోడీ వెళ్లడం లేదని.. షెడ్యూల్ సమస్యల కారణంగా మోడీ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు ఈ విషయం తెలిసిన వ్యక్తులు మీడియాకు తెలియజేశారు. ప్రధాని మోడీ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మలేషియా వెళ్తారని.. ఆసియాన్ శిఖరాగ్ర సమావేశాల్లో భారతదేశం తరపున జైశంకర్ ప్రాతినిధ్యం వహిస్తారని ఈ మేరలకు మలేషియాకు భారత్ తెలిపింది.

ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సంఘం) శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 26 నుంచి 28 వరకు కౌలాలంపూర్‌లో జరగనున్నాయి. శిఖరాగ్ర సమావేశాల్లో జరిగే చర్చల్లో భారత్ ఎంత వరకు పాల్గొంటుందనే దానిపై క్లారిటీ లేకపోయినా.. వర్చువల్‌ మోడ్‌లో మాత్రం ప్రధాని మోడీ పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి.

ఆసియాన్ శిఖరాగ్ర సమావేశం అనేది ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, రాజకీయ, భద్రత, సామాజిక-సాంస్కృతిక అభివృద్ధికి సంబంధించిన ఆసియాన్ (ASEAN) సభ్య దేశాల నాయకులు నిర్వహించే ద్వివార్షిక సమావేశం. ఈ సమావేశాలు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలను చర్చించడానికి, సహకారాన్ని బలోపేతం చేయడానికి, కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ నాయకులంతా ఒకచోట చేరతారు. ప్రస్తుతం ఈ సమావేశానికి మలేషియా అధ్యక్ష స్థానం వహిస్తోంది. ఈ సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే ట్రంప్.. మలేషియాకు సమాచారం అందించారు.

Tags:    

Similar News