Rahul Gandhi : రైల్వే స్టేషన్ లో కూలీగా మారిన కాంగ్రెస్ ఎంపీ
కూలీ దుస్తుల్లో, బరువులు మోసిన రాహుల్ గాంధీ;
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్, ఐఎస్బిటిని సందర్శించారు. అంతే కాదు వారి యూనిఫాం, బ్యాడ్జ్ ధరించి కూలీలతో సంభాషించారు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాహుల్ గాంధీ కూలీ దుస్తులు ధరించి, రైల్వే స్టేషన్లో బరువులు మోస్తూ వారితో సంభాషించడాన్ని చూడవచ్చు. ఆయన వారి ట్రేడ్మార్క్ ఎరుపు చొక్కా ధరించి, తన తలపై సామాను ఎత్తడం ఈ వీడియోలో కనిపించింది.
ఈ సందర్భంగా రాహుల్ కూలీలతో కలిసి కూర్చుని వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఢిల్లీలోని ఆనంద్విహార్ రైల్వే స్టేషన్లో ప్రజానాయకుడు రాహుల్ గాంధీజీ తన కూలీ స్నేహితులను ఈరోజు కలిశారని, ఇటీవల రైల్వే స్టేషన్లోని పోర్టర్ స్నేహితులు ఆయన్ను కలవాలనే కోరికను వ్యక్తం చేసిన వీడియో వైరల్గా మారింది.
#WATCH | Delhi: Congress MP Rahul Gandhi visits Anand Vihar ISBT, speaks with the porters and also wears their uniform and carries the load pic.twitter.com/6rtpMnUmVc
— ANI (@ANI) September 21, 2023
"ఈరోజు, రాహుల్జీ వారి మధ్యకు చేరుకుని, వారి మాటలు విన్నారు... భారత్ జోడో ప్రయాణం కొనసాగుతుంది" అని పార్టీ ఈ సందర్భంగా పేర్కొంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ పరస్పర చర్యలతో కొనసాగుతుందని ఈ వీడియో చూపిస్తోంది.
VIDEO | Congress leader Rahul Gandhi meets railway porters at Anand Vihar Railway Station in Delhi, wears porter dress and badge. pic.twitter.com/wYqOGOmB2v
— Press Trust of India (@PTI_News) September 21, 2023