మధ్యప్రదేశ్లో జరిగిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఈ ఘటన సిగ్గుచేటంటూ నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బీజేపీ పాలనలో గిరిజనుల బతుకు భారంగా మారిందని, సభ్య సమాజం తల దించుకునేలా ఉందంటూ పోస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓవ్యక్తి.. ట్రైబల్ కూలీపై మూత్రం పోసిన వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే నిందితుడు ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుడని.. బాధితుడు ట్రైబల్ వ్యక్తి అని ట్వీట్స్ చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని ప్రవేశ్ శుక్లాగా గుర్తించారు. శుక్లాపై సిద్ధి పోలీసులు IPC 294 , 504 సెక్షన్లతో SC/ST చట్టం కింద కేసు నమోదు నమోదు చేశారు.