rahul: "ఓట్ చోరీ"పై వెనక్కి తగ్గని రాహుల్‌గాంధీ

ఎన్నికల సంఘంపై రాహుల్‌గాంధీ యుద్ధం.. ఈసీకి ఎన్నికల కమిషన్‌కు 5 ప్రశ్నలు... దేశానికి ఈసీ సమాధానం చెప్పాలన్న రాహుల్;

Update: 2025-08-09 07:20 GMT

ఓట­ర్‌ జా­బి­తా అవ­క­త­వ­క­ల­తో­నే బీ­జే­పీ లో­క్‌­సభ ఎన్ని­క­ల్లో గె­లి­చిం­ద­ని, ఎన్ని­కల సంఘం రా­జ్యాం­గా­ని­కి గనుక కట్టు­బ­డి ఉంటే తాము కో­రిన వి­వ­రా­ల­ను అం­దిం­చా­ల­ని వి­ప­క్ష నేత రా­హు­ల్‌ గాం­ధీ అన్నా­రు. శు­క్ర­వా­రం బెం­గ­ళూ­రు­లో ఓట్‌ అధి­కా­ర్‌ ర్యా­లీ పే­రిట ని­ర్వ­హిం­చిన ధర్నా­లో ఆయన పా­ల్గొ­ని ప్ర­సం­గిం­చా­రు. తాము ప్ర­శ్ని­స్తుం­టే ఈసీ వెబ్ సైట్ మూ­సి­వే­సిం­ద­న్నా­రు. మహా­రా­ష్ట్ర­లో కోటి కొ­త్త ఓట­ర్లు నమో­ద­య్యా­య­ని.. కర్ణా­ట­క­లో కూడా ఫేక్ ఓట్లు నమో­ద­య్యా­య­ని పే­ర్కొ­న్నా­రు. ఒకే ఇం­ట్లో 40కి పైగా ఓట్లు ఉన్నా­య­ని రా­హు­ల్ గాం­ధీ వి­వ­రిం­చా­రు. ఇదం­తా ఓట­ర్ల­ను మోసం చే­య­డా­ని­కి భా­ర­తీయ జనతా పా­ర్టీ­తో ఎన్ని­కల సంఘం కు­ట్ర పన్నిం­ద­ని ఆరో­పిం­చా­రు. రా­జ్యాం­గం­పై దాడి చేసే ముం­దు ఒక­టి­కి రెం­డు­సా­ర్లు ఆలో­చిం­చా­ల­ని హె­చ్చ­రిం­చా­రు. బెం­గ­ళూ­రు­లో­ని ఫ్రీ­డ­మ్ పా­ర్క్‌­లో జరి­గిన ఈ ర్యా­లీ­లో రా­హు­ల్ గాం­ధీ ప్ర­సం­గిం­చా­రు. కర్ణా­టక, ఇతర రా­ష్ట్రా­ల్లో ఓటు దొం­గ­త­నం జరు­గు­తుం­ద­ని హె­చ్చ­రిం­చా­రు. ‘‘రా­జ్యాం­గం­పై దాడి చేసి తప్పిం­చు­కో­గ­ల­మ­ని మీరు అను­కుం­టే… మీరు మరో­సా­రి ఆలో­చిం­చా­లి. మేము మి­మ్మ­ల్ని ఒక్కొ­క్క­రి­గా పట్టు­కుం­టా­ము. దీ­ని­కి సమయం పడు­తుం­ది. కానీ మేము మి­మ్మ­ల్ని పట్టు­కుం­టా­ము’’ అని ఈసీ­కి వా­ర్నిం­గ్ ఇచ్చా­రు.

 అక్రమాలతోనే గెలుపు

"భారత రాజ్యాంగం విశిష్టమైనది. మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌, బసవన్న, పూలే, నారాయణ గురు ఆలోచనలు మన రాజ్యాంగంలో ప్రతిబింబిస్తున్నాయి. అలాంటి రాజ్యాంగాన్ని 2024 లోక్‌సభ ఎన్నికల నుంచి మేం మన రాజ్యాంగాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక వ్యక్తి.. ఒక ఓటు అనేది రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన హక్కు. అలాంటిది బీజేపీ, మోదీ ఆ హక్కు ఇచ్చిన రాజ్యాంగంపై దాడి మొదలుపెట్టారు. ఓటర్‌ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచింది" అని రాహుల్‌ అన్నారు.

ఈసీకి రాహుల్‌ ఐదు ప్రశ్నలు

 డిజిటల్‌ ఓటర్‌ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?

సీసీ టీవీ ఆధారాలు ఎందుకు నాశనమయ్యాయి?

నకిలీ ఓట్ల నమోదును ఎందుకు అడ్డుకోలేపోతున్నారు?

ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు?

బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్‌గా మారిందా?

స్పందించిన ఎన్నికల సంఘం

రా­హు­ల్‌­గాం­ధీ ఆరోప­ణ­ల­పై ఎన్ని­కల సంఘం స్పం­దిం­చిం­ది. రా­హు­ల్ చే­సిన ఆరో­ప­ణ­లు అసం­బ­ద్ధ వి­శ్లే­ష­ణ­గా పే­ర్కొం­ది. తప్పు­దోవ పట్టిం­చే వి­వ­ర­ణ­లు వ్యా­ప్తి చే­సి­నం­దు­కు ఫి­ర్యా­దు సమ­ర్పిం­చా­ల­ని.. లే­దం­టే దే­శా­ని­కి క్ష­మా­పణ చె­ప్పా­ల­ని ఎన్ని­కల కమి­ష­న్ డి­మాం­డ్ చే­సిం­ది. రా­హు­ల్‌­గాం­ధీ వి­శ్వ­సి­స్తే.. డి­క్ల­రే­ష­న్‌­పై సం­త­కం చేసి ఇవ్వా­ల­ని కో­రిం­ది. ఒక వేళ డి­క్ల­రే­ష­న్‌­పై సం­త­కం చే­య­క­పో­తే వి­శ్లే­షణ, తీ­ర్మా­నా­లు అసం­బ­ద్ధ­మై­న­వి­గా పరి­గ­ణిం­చా­ల్సి వస్తుం­ద­ని తె­లి­పిం­ది. లే­దం­టే దే­శా­ని­కి క్ష­మా­పణ చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­సిం­ది.ఈ ఆరో­ప­ణ­ల­ను ప్ర­స్తా­వి­స్తూ ఓ డి­క్ల­రే­ష­న్‌­పై సం­త­కం చేసి వి­డు­దల చే­యా­ల­ని రా­హు­ల్ గాం­ధీ­కి తే­ల్చి చె­ప్పిం­ది. లేని పక్షం­లో బహి­రం­గం­గా క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­ల­ని సూ­చిం­చిం­ది. రా­హు­ల్ గాం­ధీ ఆరో­ప­ణ­లు ని­రా­ధా­ర­మ­ని, తప్పు­దా­రి పట్టిం­చే­లా ఉన్నా­య­ని ఈసీ పే­ర్కొం­ది. డి­క్ల­రే­ష­న్ వి­డు­దల చే­య­క­పో­తే రా­హు­ల్ గాం­ధీ­కి తన వ్యా­ఖ్య­ల­పై నమ్మ­కం లే­న­ట్టు భా­విం­చా­ల్సి వస్తుం­ద­ని ఈసీ పే­ర్కొం­ది. కా­బ­ట్టి, పౌ­రు­ల­ను తప్పు­దా­రి పట్టిం­చి­నం­దు­కు బహి­రం­గం­గా క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­ల­ని కో­రిం­ది. రా­హు­ల్ గాం­ధీ­వి అసం­బ­ద్ధ ఆరో­ప­ణ­ల­ని తోసి పు­చ్చిం­ది.

Tags:    

Similar News