RBI : ఆర్బీఐ మూడో సారి రెపోరేటు తగ్గింపు

Update: 2025-06-06 13:45 GMT

ఆర్బీఐ మూడో సారి రెపోరేటు తగ్గించింది. ఈ సారి అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా యాభై బేసిక్ పాయింట్ల ను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో 6 శాతం ఉన్న రెపోరేటు 5.5 శాతానికి వచ్చింది. ఖర్చులను పెంచడానికి, వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో వ్యక్తిగత పన్ను రేట్లను తగ్గించిన క్రమంలోనే ఏప్రిల్ తర్వాత మరోసారి తాజాగా ఇలా రేటు తగ్గింపు నిర్ణయం తీసుకున్నది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ఎంపీసీ ఇవాళ మూడు రోజుల సమా వేశాన్ని ప్రారంభించింది. ఈ మేరకు వడ్డీ రేట్లపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ ప్రకటన చేశారు. సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మూడో సారి జరిగిన ఈ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం ప్రకటిం చడం విశేషం. ఫిబ్రవరిలో జరిగిన సమావేశం లో భాగంగా రెపోరేటును గడిచిన ఐదేళ్లలో తొలిసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఏప్రిల్లో మరో సారి 25 బేసిక్ పాయింట్లను తగ్గించారు. ఈ సారి ఏకంగా యాభై బేసిక్ పాయింట్లను తగ్గించడం విశేషం. దీంతో బెం చ్ మార్క్ రుణ రేటు ప్రస్తుతం 6 శాతం నుంచి తాజాగా 5.5 శాతానికి చేరింది.

రెపో రేటు అంటే

రెపోరేటు అంటే రీ పర్చేజ్ అగ్రమెంట్. రిజర్వ్ బ్యాంక్ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు వేసే వడ్డీ రేటు. బ్యాంకులు అర్హత కలిగిన సెక్యూరిటీలను అమ్మడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. మార్కెట్ లో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడానికి, పెంచడానికి కేంద్ర బ్యాంకు రెపో రేటును ఉపయోగిస్తుంది. ద్రవ్యో ల్బణం మార్కెట్ పై ప్రభావం చూపినప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచుతుంది. రెపోరేటు తగ్గితే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేటు తగ్గిస్తా యి. దీంతో రిటైల్, కార్పొరేట్ రుణ గ్రహీతలకు ఈఎంఐల భారం తగ్గుతుంది.

Tags:    

Similar News