జైసల్మేర్లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
భారతీయ వైమానిక దళానికి చెందిన రిమోట్గా పైలట్ చేయబడిన విమానం జైసల్మేర్ జిల్లాలోని పితాలా గ్రామంలో కూలిపోయిందని IAF గురువారం, ఏప్రిల్ 25, 2024 నాడు తెలిపింది.;
"భారత వైమానిక దళానికి చెందిన ఒక రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ ఈరోజు జైసల్మేర్ సమీపంలో ఒక సాధారణ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది," అని IAF X పోస్ట్లో పేర్కొంది.
ఎలాంటి ఆస్థి నష్టం జరగలేదని IAF పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.