వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు: ఆర్బీఐ
ఇపుడు ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది
ఇపుడు ఉన్న వడ్డీ రేట్లనే కొనసాగించాలని భారత రిజర్వు బ్యాంక్ నిర్ణయించింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ముంబైలో క్రెడిట్ పాలసీ సమీక్ష వివరాలను వెల్లడించారు ఆయన. గత ఏప్రిల్నెలలో జరిగిన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను ఆర్బీఐ మార్చలేదు. ప్రస్తుతం రెపో రేటు ఆరున్నర శాతం వద్ద ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ రేటును కట్టడి చేసేందుకు గత కొంతకాలంగా ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో ఆర్బీఐ వ్యూహం మార్చింది.