Robert Vadra: ఈడీ విచారణ తీరుపై ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆగ్రహం..
Robert Vadra: కేంద్రంలో ఉన్న బీజేపీ చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు.;
Robert Vadra: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్గాంధీని ఈడీ విచారణ తీరుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈడీతో కలిసి కాంగ్రెస్ను బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో సోనియా, రాహుల్ను అడ్డుకునేందుకే బీజేపీ.. ఈడీని ప్రయోగించిందని రాబర్ట్ వాద్రా ఆరోపించారు.