Sanjay Raut: అజిత్ పవార్ మరణం వెనుక ఏదో కుట్ర ఉంది : సంజయ్ రౌత్
జస్టిస్ లోయా మరణం గుర్తుకు వస్తుంది
దివంగత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని.. ఎందుకో తనకు జస్టిస్ లోయా మరణం గుర్తుకు వస్తుందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. తెరవెనుక ఏదో జరుగుతోందని.. కచ్చితంగా అజిత్ పవార్ అకస్మిక మరణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడిమాతో మాట్లాడారు. ఎక్కడో ఏదో జరుగుతోందని సందేహం వ్యక్తం చేశారు. కచ్చితంగా అజిత్ పవార్ మరణం అనుమానాస్పదంగా ఉందని.. తెరవెనుక ఏదో జరుగుతోందని అనిపిస్తోందన్నారు. పవార్ కుటుంబం తిరిగి కలిసేందుకు సిద్ధపడుతున్నారని.. ఇంతలోనే బీజేపీ వ్యక్తులు నీటిపారుదల కుంభకోణం ఫైళ్లతో బెదిరించారన్నారు. 10 రోజుల్లోనే అనుమానాస్పదంగా మరణించారని పేర్కొన్నారు. దీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే.. అచ్చం జస్టిస్ లోయా మరణం గుర్తుకొస్తుందన్నారు.
ఎవరీ జస్టిస్ లోయా?
ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ బ్రిజ్మోహన్ హరికిషన్ లోయా. 2014 డిసెంబర్ 1న మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ వివాహ వేడుకలో పాల్గొనడానికి వెళ్లి గుండెపోటుతో మృతి చెందారు. అకస్మాత్తుగా ప్రాణాలు వదిలారు. జస్టిస్ లోయా ఆ సమయంలో సోహ్రాబుద్దీన్ ‘ఎన్కౌంటర్’ కేసును విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉన్నారు. లోయా మరణించిన మూడేళ్ల తర్వాత కేసు మూసేశారు. అమిత్ షాను నిర్దోషిగా తేల్చింది.