PM Modi: చెక్కుచెదరని ఛరిష్మా
మోదీకి అనుకూలంగా 80 శాతం మంది.. అమెరికా ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వే
సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో మోడీ హవా తగ్గడం లేదు. 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ప్యూ రిసెర్చ్ సెంటర్ తెలిపింది. పది మంది భారతీయుల్లో ఏడుగురు ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ప్యూ రిసెర్చ్ సెంటర్ 24 దేశాలలో 30 వేల 861 మందిని సర్వే చేసి నివేదికను విడుదల చేసింది. 80 శాతం మంది భారతీయులు ప్రధాని నరేంద్ర మోదీపై సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని, వీరిలో 55 శాతం మంది మోదీపై అత్యంత సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించింది. ఐదో వంతు మంది మాత్రమే మోదీపై వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది. ఈ ప్యూ సర్వే ఫలితాలపై బీజేపీ స్పందించింది. ప్రధాని మోదీకి ఉన్న పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని అలాగే ఉందని ట్విటర్ వేదికగా పేర్కొంది. మోదీ ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెజారిటీ ప్రజలు భారత్ అంతర్జాతీయంగా మరింత బలోపేతం అవుతుందని నమ్ముతున్నారని తెలిపింది. దీనికి ప్యూ సర్వే రిపోర్ట్లే నిదర్శనమని పేర్కొంది.
పది మంది భారతీయుల్లో ఏడుగురు ప్రపంచంలో భారత్ ప్రబల శక్తిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. 2022 సర్వేలో ఇది 28 శాతం మాత్రమేనని ప్యూ సంస్థ వెల్లడించింది. 24 దేశాలలో 30 వేల 861 మందిని సర్వే చేసినట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 46 శాతం మంది భారత్పై సానుకూలంగా ఉన్నారని ప్యూ సంస్థ తన నివేదికలో తెలిపింది. ఇజ్రాయెల్లో 71 శాతం మంది భారత్పై సానుకూల అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని వెల్లడించింది. 34 శాతం మంది భారత్పై సానుకూలంగా లేరని సర్వేలో వెల్లడైంది. 16 శాతం మందికి అసలు ఎటువంటి అభిప్రాయము లేదని ప్యూ సంస్థ తెలిపింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రభావం మరింత బలపడుతోందని 49 శాతం భారతీయులు చెప్పగా, లేదు రష్యా ప్రభావం పెరుగుతోందని 41 శాతం మంది చెప్పారు. అయితే చైనా ప్రభావంపై మాత్రం భారతీయుల స్పందన మిశ్రమంగా ఉందని ప్యూ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ ప్రజాదరణ ఏమాత్రం చెక్కుచెదరలేదని ప్యూ సంస్థ నివేదికను ఉటంకిస్తూ భాజపా ట్వీట్ చేసింది. మెజారిటీ ప్రజలు ప్రపంచంపై ఇండియా ప్రభావం పెరిగినట్లు విశ్వసిస్తున్నారని పేర్కొంది.