Terrorists Attack: ఆర్మీ కాన్వాయ్పై భారీ ఉగ్ర దాడి
నలుగురు జవాన్ల వీరమరణం…;
జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. సోమవారం భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు.
వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది. మరోవైపు రాజౌరీ వద్ద మాఝకోట్ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక జవాన్కు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఆర్మీ ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు పరారయ్యారు. ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ విసిరిన ఘటనా స్థలం నుంచి ఆర్మీ వాహనం యొక్క చిత్రం కూడా బయటపడింది. అందులో కాల్పుల కారణంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. దాడి అనంతరం లోయలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కొండపై దాక్కున్న ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై కాల్పులు జరిపారు. మరియు ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ కూడా విసిరారు. సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా, లోయలో అలజడి పెరిగిందని తెలిసిందే. ఉగ్రవాదులతో ఎన్కౌంటర్కు సంబంధించిన వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. జమ్మూకశ్మీర్లోని రాజౌరీలోని భారత ఆర్మీ క్యాంపుపై ఒక రోజు ముందు ఉగ్రదాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను గాయపడ్డాడు. ఈ సమయంలో.. చీకటిని ఉపయోగించుకుని ఉగ్రవాదులు తప్పించుకోవడంలో విజయం సాధించారు.
కుల్గాం జిల్లాలో శనివారం ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదులకు సంబంధించిన కొత్త విషయం బయటపడింది. చిన్నిగామ్ ఫీసల్ అనే గ్రామంలో జనావాసాల మధ్య ఇంటి కప్బోర్డులో ఉగ్రవాదులు నిర్మించుకున్న బంకర్ చూసి ఆర్మీ ఆశ్చర్యపోయింది. కప్బోర్డు ద్వారా లోపలికి దూరి వెళ్లే విధంగా నిర్మించిన ఈ బంకర్ పూర్తి కాంక్రీట్తో నిర్మించి ఉంది. కొన్నేండ్ల క్రితం ఉగ్రవాదులు సెప్టిక్ ట్యాంక్ కింద ఇలాగే బంకర్ ఏర్పాటు చేసుకోగా, దానిని సైనికులు కనిపెట్టి ధ్వంసం చేశారు. ఇప్పుడు ఉగ్రవాదులు కిచెన్లు, అల్మరాలు, డ్రాయింగ్ రూమ్ల వెనుక బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఆర్మీ గుర్తించింది.