UPI : యూపీఐ చెల్లింపుల పరిమితి రూ.5లక్షలకు పెంపు

Update: 2024-09-17 08:30 GMT

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్స్ ఉపయోగించి రూ.5 లక్షల వరకు ట్యాక్స్ పేమెంట్లు చేయవచ్చు. ఇది దేశంలోని లక్షలాది మంది ట్యాక్స్ పేయర్లకు ఊరట కల్పించనుంది. ఈ మేరకు యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విధానం తక్షణమే అమల్లోకి వస్తుంది.

మరోవైపు.. ధ్రువీకరించిన వ్యాపారుల ఎంసీసీ 9311 కేటగిరీకి లావాదేవీ పరి మితిని పెంచాలని బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు, యూపీఐ యాప్లను ఎస్పీసీఐ కోరింది. 'ఎంసీసీ 9311 పరిధిలోని తమ వ్యాపారులు కచ్చితంగా పన్ను చెల్లింపులకు మాత్రమే కట్టుబడి ఉండేలా చూసుకోవాలి. సరైన జాగ్రత్తల తర్వాత ధ్రువీకరించిన వ్యాపారి జాబితాకు ఎంటీటీలు జోడించాలి.' అని పేర్కొంది.

పెరిగిన పరిమితికి పేమెంట్ మోడ్ యూపీఐ యాప్స్ మార్పులు చేసి నట్లు వ్యాపారులు నిర్ధారించుకోవాలని సూచించింది. అలాగే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవై డర్లు, యూపీఐ యాప్స్ సెప్టెంబర్ 15, 2024 వరకు తమ పేమెంట్ లిమిట్ పెంచేలా చూడాలని స్పష్టం చేసింది. యూపీఐ పేమెంట్లు ద్వారా ట్యాక్స్ చెల్లింపుల పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఎస్ పీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ట్యాక్స్ నిపుణులు స్వాగిస్తున్నారు.

Tags:    

Similar News