UPSC: యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి మనోజ్ సోనీ రాజీనామా..
వ్యక్తిగత కారణాలతో రిజైన్ చేసినట్లు పేర్కొన్న మనోజ్ సోనీ..;
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. గతేడాది ఏప్రిల్ నెలలోనే బాధ్యతలు చేపట్టిన ఆయన.. ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం గమనార్హం. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వివాదంతో మనోజ్ సోనీ రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి.
యూపీఎస్సీ చైర్పర్సన్ మనోజ్ సోనీ 2029లో పదవీకాలం ముగియడానికి దాదాపు 5 సంవత్సరాలు ఉంది. గత నెల రోజుల క్రితమే రాజీనామా చేశారని, అయితే అది ఆమోదం పొందుతుందా లేదా అనే విషయంపై ఏమీ చెప్పలేమని అధికారిక వర్గాలు చెప్పాయి. 2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరారు.. అయన మే 16, 2023న చైర్పర్సన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మనోజ్ సోనీ ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు. 2005లో వడోదరలోని ప్రసిద్ధ ఎంఎస్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్గా ప్రధాని మోడీ ఆయనను ఎన్నుకున్నారు. 40 ఏళ్ల వయసులో దేశంలోనే అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్గా మనోజ్ సోనీ నిలిచారు.