Vishwas Kumar Video: విమానం మంటల్లో నుంచి బిందాస్ గా బైటకు
విమానం మంటల్లో నుంచి బిందాస్ గా బైటకు;
ఎయిరిండియా విమానంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ ఘటనా స్థలి నుంచి ఎలా బయటకు వచ్చాడనే విషయాన్ని తెలిపే మరొక కొత్త వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో విమానం మంటల్లో కాలిపోతుండగా, బీజే వైద్య కళాశాల ప్రాంగణం నుంచి రమేశ్ నడుచుకుంటూ రావడం కనిపించింది. అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు 64 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్టు అధికారులు తెలిపారు. సోమవారం వరకు 99 మంది బాధితుల వివరాలను డీఎన్ఏ టెస్టు ద్వారా తెలుసుకోగలిగామన్నారు.
ఇంకా గుర్తించని మృత దేహాల గురించి వారి బంధువులు ఆందోళనకు గురి కావొద్దని సిటీ సివిల్ దవాఖాన సూపరింటెండెంట్ రాకేశ్ జోషి విజ్ఞప్తి చేశారు. 72 గంటల్లో పూర్తవుతుందని చెప్పిన డీఎన్ఏ పరీక్ష 84 గంటలైనా పూర్తి కాకపోవడంతో మృతుల బంధువులు సిటీ సివిల్ దవాఖాన వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నది. అయితే ప్రమాదంలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు తెలిపారు.