Vijay Rupani: విజయ్‌ రూపానీ మృతదేహం గుర్తింపు.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

గుజరాత్ లో ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటన;

Update: 2025-06-16 01:15 GMT

అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో చనిపోయిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మృతదేహాన్ని డీఎన్ఏ టెస్ట్ ద్వారా గుర్తించారు. లండన్‌లో ఉంటున్న భార్య, కుమార్తెను చూసేందుకు వెళ్తుండగా అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయి 241 మంది ప్రాణాలు చనిపోయారు. ఇందులో విజయ్ రూపానీ ఉన్నారు. డీఎన్‌ఏ టెస్ట్ ద్వారా 3 రోజుల తర్వాత విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు.

ఇక సోమవారం అధికారిక లాంఛనాలతో విజయ్ రూపానీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన జ్ఞాపకార్థంగా ఒకరోజు రాష్ట్ర సంతాప దినంగా ప్రకటించింది. అంత్యక్రియలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక విమానం ఎక్కే ముందు విమానాశ్రయంలో విజయ్ రూపానీ ఆనందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరు బ్రిటిష్ జాతీయులు చిత్రీకరించిన వీడియోలో దృశ్యాలు కనిపించాయి.

విజయ్ రూపానీ లండన్ టికెట్‌ను రెండుసార్లు రద్దు చేసుకున్నారు. మే 19, జూన్ 5న లండన్ వెళ్లాలనుకున్నారు. కానీ రెండు సార్లు రద్దైంది. జూన్ 25 తిరిగి రావాలని అనుకున్నారు. ఎట్టకేలకు మూడోసారి జూన్ 12 ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ మూడోసారి మృత్యువుకు దిరికిపోయారు.

జూన్ 12న ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. మెడికోలో ఉంటున్న హాస్టల్‌పై విమానం కూలిపోయింది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనం ఉంది. సుదూర ప్రయాణం కావడంతో భారీగా ఇంధనం ఉంది. అయితే విమానం కూలిపోగానే పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా 12 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కరు మినహా మిగతా వారంతా చనిపోయారు. స్వల్ప గాయాలతో ఒక్క ప్రయాణికుడు బయటపడ్డాడు. ఇక మెడికోలు కూడా ఇప్పటి వరకు 35 మంది చనిపోయారు.  

Tags:    

Similar News