మీరేమైన చరిత్రకారులా.. ఏ ఆధారలతో ఆ వ్యాఖ్యలు చేశారు.. : కమల్ ను ప్రశ్నించిన కర్ణాటక కోర్టు..

సీనియర్ నటుడు కమల్ హాసన్.. తాను నటించి, నిర్మించిన సినిమా అందరూ చూడాలనుకున్నాడు. దేశవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధించాలనుకున్నాడు.. కానీ తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. కర్ణాటక హైకోర్టు ఆగ్రహానికి దారితీశాయి.;

Update: 2025-06-03 08:16 GMT

సీనియర్ నటుడు కమల్ హాసన్.. తాను నటించి, నిర్మించిన సినిమా అందరూ చూడాలనుకున్నాడు. దేశవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లు సాధించాలనుకున్నాడు.. కానీ తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి. కర్ణాటక హైకోర్టు ఆగ్రహానికి దారితీశాయి. 

" కన్నడ తమిళం నుంచి పుట్టింది" అని నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక హైకోర్టు మంగళవారం తీవ్రంగా తప్పుబట్టింది. కన్నడిగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయి అతడి వ్యాఖ్యలు.. అందుకే వారి ఆగ్రహానికి గురయ్యాడు.. అతడి తాజా సినిమా 'థగ్ ఆఫ్ వార్' ను రిలీజ్ కానివ్వకుండా అడ్డుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. సరే తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబితే సరిపోయేది కానీ ఆ విధంగా చెప్పడానికి కూడా అతడు అంగీకరించట్లేదు.. క్షమాపణ చెప్పాలి కమల్ హాసన్ కచ్చితంగా అని  సింగిల్ జడ్జి జస్టిస్ ఎం నాగప్రసన్న అన్నారు.

ఏ పౌరుడికీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే హక్కు లేదు. భూమి, నీరు, భాష ఈ మూడు పౌరులకు అత్యంత ముఖ్యమైనవి....భాష అనేది ఒక నిర్దిష్ట ప్రజలకు అనుబంధించబడిన ఒక భావోద్వేగం. దానిని దెబ్బతీసేలా మీరు మాట్లాడారు' అని కోర్టు పేర్కొంది. అలా మాట్లాడడానికి మీరేమైనా చరిత్రకారులా లేక భాషావేత్తనా అని కోర్టు కమల్ ని ప్రశ్నించింది. 

ఏ భాషా మరొక భాష నుండి పుట్టదు - దీనికి చాలా అంశాలు పరిగణలోకి వస్తాయి. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. వేదికలెక్కి ప్రసంగించేటప్పుడు జాగుతూకతతో ఉండాలి. ఆచి తూచి మాట్లాడాలి. మన మాటలు ఎవరినీ నొప్పించకుండా ఉండేాలా జాగ్రత్తపడాలి. అనవసరంగా వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దు అని కమల్ ని కర్ణాటక హైకోర్టు మందలించింది. 

కమల్ హాసన్ నటించిన కోలీవుడ్ చిత్రం "థగ్ లైఫ్" ను కర్ణాటకలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రదర్శించడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కోర్టు విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్రాన్ని బహిష్కరించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) ఇటీవల తీసుకున్న నిర్ణయం తర్వాత, కమల్ హాసన్ స్థాపించిన సినిమా సహ నిర్మాత రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (పిటిషనర్) ఈ పిటిషన్ దాఖలు చేశారు.

జూన్ 5 నుండి సినిమా ప్రదర్శన అంతరాయం లేకుండా ఉండేలా చూసేందుకు, సినిమా దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు మరియు చిత్ర నిర్మాణంలో పాల్గొన్న ఇతరులతో పాటు, చిత్రాన్ని ప్రదర్శించేవారు, సినిమా ప్రేక్షకులు మరియు ప్రజలకు అవసరమైన భద్రతను కల్పించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోరారు. చివరికి ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ విషయాన్ని విచారించి, ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. 



Tags:    

Similar News