ప్రేమలో పడిన వైఎస్ షర్మిల తనయుడు.. త్వరలో మోగనున్న పెళ్లి బాజాలు

వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వరలో ప్రియా అట్లూరిని పెళ్లి చేసుకోబోతున్నారు.

Update: 2023-12-02 09:36 GMT

వైఎస్ షర్మిల తనయుడు రాజా రెడ్డి త్వరలో ప్రియా అట్లూరిని పెళ్లి చేసుకోబోతున్నారు. అమెరికాలో గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. పై చదువుల కోసం USA వెళ్ళిన రాజారెడ్డికి, అక్కడే చదువుకుంటున్న ప్రియ అట్లూరితో పరిచయం ప్రేమగా మారింది. ప్రియకు US పౌరసత్వం కూడా ఉంది. ప్రియా అట్లూరి అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలు.

ఈ యువ జంట కలయిక తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమైన సంఘటనలలో ఒకటిగా మారనుంది. అయితే వైఎస్ కుటుంబంలో కులాంతర, మతాంతర వివాహాల చరిత్ర ఉండడంతో ఇది కొత్త వార్త ఏమీ కాదు. వైఎస్ షర్మిలది కూడా కులాంతర వివాహం కావడం గమనార్హం. 

Tags:    

Similar News