ఢిల్లీ లిక్కర్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ దాఖలు చేసిన రెండో ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈనెల 24 నుంచి వాదనలు వినబోతోంది. మరోవైపు ఈనెల 6న రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈడీ. ఈ ఛార్జ్షీట్లో మాగుంట రాఘవ, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రాపై అభియోగాలు నమోదు చేసింది ఈడీ. ఇక ఇవాళ మాగుంట రాఘవ బెయిల్పై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చే అవకాశముంది.