రైలు కింద పడి నిండు గర్భిణి....

ఆర్ధిక సమస్యలతో దంపతుల ఆత్మహత్య

Update: 2023-04-19 09:48 GMT

ఆర్ధిక ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కడపలో చోటు చేసుకుంది. విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమామాలినీలకు ఏడాది క్రితం వివాహం జరిగింది. సాయి కుమార్ చిరు వ్యాపారి కాగా, కొన్ని రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నాడు. దీనికితోడు హేమ 8 నెలల గర్భవతి. బిడ్డ పుడితే పరిస్థితులు మరింత దిగజారతాయని భావించి మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News