కర్ణాటకలోని ధార్వాడ్లో మంగళవారం రాత్రి బీజేపీ యువమోర్చా నాయకుడు ప్రవీణ్ కమ్మర్ హత్యకు గురయ్యారు. భాజాపా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ హత్యకు రాజకీయ వైరుధ్యమే కారణమని, తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు. ఈ హత్య సంబంధం ఉన్నవారెవరినీ విడిచిపెట్టబోమని, దీనిపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.