భగ్గుమంటోన్న సూరీడు....

ఉక్కపోతతో ప్రజలు విలవిల

Update: 2023-04-21 10:08 GMT

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాలో పగటి పూట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలపైనే నమోదు అవుతున్నాయి. ఇక తీర ప్రాంతం అయిన విశాఖ నగరంలో సైతం వేసవి ప్రతాపం తీవ్రంగా ఉంది. ఎండవేడిమి కారణంగా అస్వస్థతకు గురై పలువురు ఆస్పత్రి పాలవుతున్నారు. ఇక ఎండల తీవ్రత నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని  వైద్యులు హెచ్చరిస్తున్నారు. 

Tags:    

Similar News