అమరావతిలో మళ్లీ అలజడి చెలరేగింది. రాజధానిలో పేదలకు సెంటు స్థలం ఇస్తామంటూ.. ఆర్5 జోన్లో భూములను సిద్ధం చేసే ప్రయత్నం చేస్తోంది సీఆర్డీఏ. నిన్న కృష్ణాయపాలెంలో ప్రొక్లెయినర్లను దించిన సీఆర్డీఏ.. ఇవాళ ప్రొక్లయినర్తో ఐనవోలు సమీపంలో కంపను తొలగించే ప్రయత్నం చేస్తోంది. సీఆర్డీఏ చర్యలపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆర్5 జోన్ అంశం హైకోర్టులో ఉన్నందున.. సీఆర్డీఏ చర్య కోర్టు ధిక్కరణే అంటున్నారు రైతులు.