విశాఖలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఎండవేడిని తట్టుకోలేక విశాఖ జూ పార్క్లో జంతువులు నీటిలో సేదతీరుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు వాటికి సంరక్షణ చర్యలు చేప డుతున్నారు. వేడిని తట్టుకునేవిధంగా తాటాకుల పందిళ్లు వేశారు. అటు సందర్శకులతో జూ పార్క్లో సందడి నెలకొంది.