ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం ప్రభంజనం కొనసాగుతుంది. 83వ రోజు మంత్రాలయం విడిది కేంద్రం నుంచి పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్.. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మిగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు, మహిళలు భారీగా తరలివచ్చి యువనేతకు అపూర్వ స్వాగతం పలికారు. టీడీపీ, యువగళం జెండాలు, తోరణాలతో యువగళం హోరెత్తింది. దారి పొడువునా.. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నినాదాలతో యువగళం పాదయాత్ర ఉరకలేత్తింది.