ఏపీలో టీచర్ల సెలవులకు జగన్ సర్కార్ నో చెప్పేసింది. దీంతో ఇప్పటివరకూ వెకేషన్ ఎంప్లాయిస్గా ఉన్న టీచర్లు ఇప్పుడు నాన్-వెకేషన్ ఎంప్లాయిస్గా మారిపోనున్నారు. ఈ సమ్మర్ హాలీడేస్లో వారికి అనేక పనులు అప్పగిస్తూ షెడ్యూల్ను రిలీజ్ చేసింది. అయితే ఇందుకోసం టీచర్లు స్కూళ్లకు రావాలా వద్దా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. కానీ టాస్క్లను మాత్రం పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంతో టీచర్లు మండిపడుతున్నారు.