ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: బాలకృష్ణ
పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న బాలయ్య
ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సికింద్రాబాద్ పార్లమెంట్ మినీ మహానాడులో పాల్గొన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల్లో గూడు కట్టుకుందన్నారు. ఆంధ్రా, తెలంగాణ భౌగోళికంగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు యువత సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని సూచించారు.