సైకిల్ పై మంత్రి పువ్వాడ
గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని సీతాకోక చిలుకలా మార్ఛిన ఘనత కేసీఆర్ దే అంటూ కితాబు
గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని సీఎం కేసీఆర్ సీతాకోక చిలుకలా మార్చారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కితాబిచ్చారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో ప్రజా సమస్యలు అడిగి తెలుసుకునేందుకు వన్ టౌన్, టూ టౌన్లో సైకిల్పై పర్యటించారు. కొత్త బస్టాండ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. టాయిలెట్స్ను పరిశీలించారు. బస్టాండ్ నిర్వాహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారులు, రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.