హైదరాబాద్ KPHBలో విషాదం నెలకొంది. భీమవరానికి చెందిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే గ్రామానికి చెందిన ఆకుల శ్యామ్, పోతుల జ్యోతి దగ్గరి బంధువులు. వీరు గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. రెండు రోజుల క్రితం ఈ జంట హైదరాబాద్ చేరుకొని స్నేహితుడి రూంలో ఉంటున్నారు. అయితే పాయిజన్ తీసుకుని యువతి, సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని యువకుడు సూసైడ్ చేసుకున్నారు.