మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మోహిత్యాంచే వడ్గావ్ ప్రజలు స్వచ్ఛంధంగా డిజిటల్ డీటాక్స్ కు పూనుకున్నారు. గ్రామంలోని భైరవనాథ్ ఆలయంపై ఏర్పాటు చేసిన సైరన్ మోగగానే గ్రామస్థులంతా ఎక్కడి వారక్కడ టీవీలు, సెల్ ఫోన్ లు పక్కన పెట్టి కుటుంబంలోని వ్యక్తులతో కలసి సమయం గడుపుతారు. పిల్లలు చదువుకుంటున్నారు. తొమ్మిది నెలలుగా ఇదే పద్దతిని ఆచరిస్తున్నారు. ఈ మార్పు తమలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు.