అదానీ కేసు విచారణలో మరో ఆరు నెలలు గడువు కోరిన సెబీ
హిండెన్బర్గ్ రీసెర్చి నివేదికలో పేర్కొన్న అంశాలు చాలా సంక్లిష్టమైనవని మనవి
అదానీ కంపెనీలపై కొత్త వివాదం నెలకొంది. 2016 నుంచి అదానీ కంపెనీలపై తాము దర్యాప్తు చేయలేదని సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది సెబీ. మరోవైపు అదానీ కంపెనీలపై హిండెన్బర్గ్ రీసెర్చి నివేదికలో పేర్కొన్న అంశాలు చాలా సంక్లిష్టమైనవని.. దీన్ని దర్యాప్తు చేసేందుకు మరో ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరింది. గత విచారణ సమయంలో మూడు నెలల గడువు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి మౌఖికంగా చెప్పారు. తాజా రీజాయిండర్ అఫిడవిట్ చూశాక.. ఎలాంటి గడువు ఇవ్వకుండా విచారణ వాయిదా వేశారు.