పార్టీ హైకమాండ్ పిలుపు మేరకు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ బీజేపీని గాడిన పెట్టే పనిలో ఉన్న అగ్ర నాయకత్వం, కర్నాటక ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. నాయకుల మధ్య వర్గపోరుపై బీజేపీ అగ్ర నాయకత్వం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. నాయకుల వ్యక్తిగత లక్ష్యాలతో పార్టీ నష్టపోతోందన్న భావనలో కమలం పార్టీ నాయకులు ఉన్నారు. పరిస్థితులు చేయి దాటకముందే తెలంగాణ బీజేపీని గాడిలో పెట్టాలని పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సంజయ్, ఈటల రాజేందర్ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.